‘పెళ్లి చేసుకుంటున్నా తొలి మ్యాచ్‌కు రాలేను’

16 Feb, 2018 11:08 IST|Sakshi
ప్రేయసితో ఫించ్‌ (ఫైల్‌ ఫొటో)

ఆస్ట్రేలియా ఆటగాడు ఆరోన్‌ ఫించ్‌

తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌కు ఫించ్‌, మాక్స్‌వెల్‌ దూరం

ఏప్రిల్‌7న ప్రేయసితో ఆరోన్‌ ఫించ్‌ పెళ్లి

8న పంజాబ్‌-ఢిల్లీ తొలి మ్యాచ్‌

సాక్షి, స్పోర్ట్స్‌ : ఐపీఎల్‌ 2018 సీజన్‌ తొలి మ్యాచ్‌కు తాము అందుబాటులో ఉండటంలేదని ఆస్ట్రేలియా ఆటగాళ్లు, ఆరోన్‌ ఫించ్‌, గ్లేన్‌ మ్యాక్స్‌వెల్‌లు స్పష్టం చేశారు. ఫించ్‌ కింగ్స్‌ ఎల్‌వన్‌ పంజాబ్‌కు ఫ్రాతినిథ్యం వహిస్తుండగా.. మ్యాక్సీ ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ తరఫున ఆడునున్నాడు. ఐపీఎల్‌-11 సీజన్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 7న ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ తొలి సమరంతో ఈ సీజన్‌ ఐపీఎల్‌కు తెరలేవనుంది.

ఏప్రిల్ 8న పంజాబ్, ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు రోజు ఏప్రిల్‌ 7న ఫించ్‌ ప్రేయసి అమీ గ్రిఫ్త్స్‌ను పెళ్లి చేసుకోనున్నాడు. ఈ పెళ్లికి మ్యాక్స్‌వెల్‌ మాస్టర్‌ ఆఫ్‌ సెర్మెనీగా (వధువరులతో ప్రమాణం చేయించడం) వ్యవహరించనున్నాడు. దీంతో ఇద్దరు ఆసీస్‌ ఆటగాళ్లు తొలి మ్యాచ్‌కు దూరం కానున్నారు.

‘ఐపీఎల్ మ్యాచ్‌లు ఏప్రిల్ 15 నుంచి ప్రారంభం అవుతాయనే ఉద్దేశంతో పెళ్లిని 7న పెట్టుకున్నాను. ఐపీఎల్ షెడ్యూల్ చూశాను. ఇప్పుడు పెళ్లిని వాయిదా వేసుకోలేను. కాబట్టి ఆరంభ మ్యాచ్‌కు రాలేను. 13న జరిగే రెండో మ్యాచ్‌కు చాలా సమయం ఉంది. ఆ టైంలోగా జట్టులో చేరిపోతానని’ ఫించ్‌ తెలిపాడు.

మరిన్ని వార్తలు