ముంబైని గెలిపించింది ఈ బామ్మ అట!

23 May, 2017 20:39 IST|Sakshi
ముంబైని గెలిపించింది ఈ బామ్మ అట!

ఐపీఎల్‌-10 ఫైనల్‌ పోరు ముంబై ఇండియన్స్‌-రైజింగ్‌ సూపర్‌ జెయింట్స్‌ మధ్య ఉత్కంఠంగా సాగుతోంది. పుణే విజయానికి 4 బంతుల్లో 7పరుగులు కావాలి. మామూలుగా ఇది సాధ్యమే. కానీ సాధ్యాన్ని అసాధ్యంగా మార్చింది ముంబై. ఒక పరుగు తేడాతో ఐపీఎల్‌-10 విజేతగా నిలిచింది. ఇందుకు కారణం ముంబై టీం పర్ఫార్మెన్స్‌ కాదట.

4 బంతులు మిగిలివుండగా ముంబై గెలవాలని కళ్లు మూసుకుని స్టేడియంలో ప్రార్థన చేసిన బామ్మట. ఆమె ప్రార్ధనే ముంబైకు మిరాకిల్‌ విన్‌ దక్కేలా చేసిందని ట్వీట్‌లు హోరెత్తాయి. ఆమెకు 'ప్రేయర్‌ ఆంటీ' అని పేరు పెట్టేశారు ట్వీటరాటీలు. ఈ ట్వీటర్‌లో వెల్లువలా వస్తున్న ప్రేయర్‌ ఆంటీ ట్వీట్లను చూసిన బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ కూడా రీట్వీట్‌ చేశారు.

ఏమనో తెలుసా?. ఆమె ఎవరో కాదు ముంబై ఇండియన్స్‌ యజమాని నీతూ అంబానీ అమ్మ అని. ఆమెను అందరూ ముద్దుగా 'నాని' అని పిలుస్తారు అని చెప్పారు. దీంతో థ్యాంక్స్‌ నాని మీ వల్లే ముంబై ఇంత ఘనవిజయం సాధించిందని నెటిజన్లు ఆమెకు ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని వార్తలు