అడిలైడ్: వరల్డ్ కప్ సన్నాహకాల్లో భాగంగా మంగళవారం ఇక్కడ జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా నిర్ధేశించిన 365 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 30 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. ఓపెనర్లు జావెద్ అహ్మది 17 పరుగులు, ఉస్మాన్ ఘని 44 పరుగులు చేసి ఔటవగా, మంగల్ (48), అస్గర్(13) పరుగులతో క్రీజులో ఉన్నారు.