భారత్‌ VS పాక్‌

24 Jun, 2017 00:56 IST|Sakshi

సాయంత్రం గం.4.15 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌–2లో ప్రత్యక్షప్రసారం  
లండన్‌: వరుసగా మూడు విజయాలతో హాకీ వరల్డ్‌ లీగ్‌ సెమీఫైనల్స్‌ను భారత్‌ ఘనంగానే ఆరంభించినా... ఆ తర్వాత గతి తప్పిన ఆటతో టైటిల్‌ రేసు నుంచి నిష్క్రమించింది.

ఈ నేపథ్యంలో నేడు (శనివారం) తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. 5 నుంచి 8 స్థానాల కోసం జరిగే ఈ వర్గీకరణ మ్యాచ్‌పై అభిమానుల్లో భావోద్వేగాలు మరోసారి తారస్థాయిలో ఉండటం ఖాయం. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉన్న భారత జట్టు క్వార్టర్స్‌లో 14వ ర్యాంకులో ఉన్న మలేసియా చేతిలో 2–3తో కంగుతిన్న విషయం తెలిసిందే. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటములతో ఆత్మవిశ్వాసం కోల్పోయిన మన్‌ప్రీత్‌ సింగ్‌ సేన దాయాది పాక్‌తో ఎలా చెలరేగుతుందనేది ఆసక్తికరం.

మరిన్ని వార్తలు