ఐపీఎల్‌ బిడ్డింగ్‌ బరిలో ఎయిర్‌టెల్, యాహూ

25 Aug, 2017 01:06 IST|Sakshi

న్యూఢిల్లీ:  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) డిజిటల్‌ హక్కుల కోసం టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్, వెబ్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ యాహూ బరిలోకి దిగాయి. ఈ మేరకు ఐపీఎల్‌ బిడ్‌ డాక్యుమెంట్‌ను ఎయిర్‌టెల్, యాహు కొనుగోలు చేసినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

వీటితో పాటు మరో రెండు కొత్త కంపెనీలు బామ్‌టెక్, డీఏజడ్‌ఎన్‌/ పర్ఫామ్‌ గ్రూప్‌ కూడా ఆన్‌లైన్‌ హక్కుల కోసం పోటీపడుతున్నాయని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు