సెమీస్‌లో జయరామ్‌ ఓటమి

17 Jun, 2018 12:20 IST|Sakshi

ఫులర్టన్‌ (అమెరికా): యూఎస్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌ 300 టోర్నమెంట్‌లో భారత్‌ పోరాటం ముగిసింది. భారత షట్లర్‌ అజయ్‌ జయరామ్‌ సెమీస్‌లో ఓటమి చెంది ఇంటిదారి పట్టాడు. అజయ్‌ జయరామ్‌ 13- 21, 21-23 తేడాతో మార్క్ కాలిజో(నెదర్లాండ్స్‌) చేతిలో పరాజయం పాలై టోర్నీ నుంచి వైదొలిగాడు. తొలి గేమ్‌ను సునాయాసంగా చేజార్చుకున్న అజయ్‌ జయరామ్‌.. రెండో గేమ్‌లో మాత‍్రం కడవరకూ పోరాడాడు. కాగా, వరుసగా రెండు పాయింట్లు గెలిచిన కాలిజో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా కైవసం చేసుకుని ఫైనల్‌కు చేరాడు.

మరిన్ని వార్తలు