సెంచరీకి రహానే భార్య ఫిదా..

4 Aug, 2017 11:33 IST|Sakshi
సెంచరీకి రహానే భార్య ఫిదా..
కొలంబో: టెస్టుల్లో నిలకడలేమి ఆటతో సతమతమైన భారత వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానే ఎట్టకేలకు గాడిన పడ్డాడు. కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శతకం బాది తన సత్తా చాటాడు. టెస్టుల్లో17 ఇన్నింగ్స్‌ల అనంతరం కెరీర్‌లో తొమ్మిదో సెంచరీ నమోదు చేశాడు.  ఈ వైస్‌ కెప్టెన్సీ అడదడఫా అర్ధ శతకాలు సాధించినా సెంచరీ మాత్రం చేయలేదు.
 
ఇక ఈ శతకంతో అతని భార్య రాధిక అనందానికి అవధులు లేవు. సెంచరీ అనంతరం ఆమె కెరీంతలు కొడుతూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ వీడియోను బీసీసీఐ అధికారిక ట్వీటర్‌లో ‘ఇక ఆమె అజింక్యా టెస్టు కెరీర్‌లో అద్భుత సెంచరీ సాధించడాని చెప్పుకుంటుందని’ క్యాప్షన్‌గా ట్వీట్‌ చేసింది. రహానే తన చివరి 17 ఇన్నింగ్స్‌లో కేవలం మూడు సార్లు మాత్రమే అర్ధ సెంచరీకిపైగా పరుగులు చేసాడు. 
మరిన్ని వార్తలు