దేవధర్‌ ఫైనల్లో భారత్‌ ‘బి’ 

25 Oct, 2018 01:57 IST|Sakshi

న్యూఢిల్లీ: దేవధర్‌ ట్రోఫీలో భారత్‌ ‘బి’ జట్టు ఫైనల్‌కు చేరింది. భారత్‌ ‘సి’తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ‘బి’ 30 పరుగులతో నెగ్గింది. తొలుత విహారి (76; 6 ఫోర్లు) రాణించడంతో భారత్‌ ‘బి’ 50 ఓవర్లలో 9 వికెట్లకు 231 పరుగులు చేసింది. తర్వాత భారత్‌ ‘సి’ 48.1 ఓవర్లలో 201 పరుగులకే ఆలౌటైంది.  

మరిన్ని వార్తలు