చెన్నైకి పాకిస్థాన్ స్పిన్నర్లు

24 Dec, 2014 09:53 IST|Sakshi
చెన్నైకి పాకిస్థాన్ స్పిన్నర్లు

కరాచీ: సందేహాస్పద బౌలింగ్ శైలి కారణంగా నిషేధం ఎదుర్కొంటున్న పాకిస్తాన్ క్రికెట్ స్పిన్నర్లు సయీద్ అజ్మల్‌, మొహమ్మద్ హఫీజ్‌ చెన్నైకి వెళ్లనున్నారు. ఐసీసీ గుర్తింపు పొందిన చెన్నై బౌలింగ్ సెంటర్ లో తమ బౌలింగ్ యాక్షన్ ను వారు పరీక్షించుకోనున్నారు.

అజ్మల్‌, హఫీజ్‌ అభ్యర్థన మేరకు వారిని చెన్నై పంపుతున్నట్టు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తెలిపింది. వారి పర్యటన ఖరారైందని వెల్లడించింది. భారత హైకమిషన్, తమ విదేశాంగ శాఖ అనుమతి కూడా లభించిందని తెలిపింది. రెండు, మూడు రోజుల్లో అజ్మల్‌, హఫీజ్‌ చెన్నైకి బయలుదేరతారని పేర్కొంది.

మరిన్ని వార్తలు