ఆకాశ్, అనన్యలకు టైటిల్స్

29 Jul, 2014 23:53 IST|Sakshi

 అండర్-14 టెన్నిస్ టోర్నీ
 ఎల్బీ స్టేడియం: హైదరాబాద్ అండర్-14 టాలెంట్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఎల్. ఆకాశ్ రెడ్డి, అనన్య మోహన్ విజేతలుగా నిలిచారు. ఇమాన్యుయెల్ కోచింగ్ సెంటర్, సూర్యోదయ టెన్నిస్ అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన ఈ టోర్నీలో బాలుర సింగిల్స్ టైటిల్‌ను ఆకాశ్, బాలికల టైటిల్‌ను అనన్య కైవసం చేసుకున్నారు.  సికింద్రాబాద్‌లోని అకాడమీలో మంగళవారం జరిగిన బాలుర సింగిల్స్ ఫైనల్లో ఆకాశ్ రెడ్డి 3-6, 7-6, 6-4తో అమన్ అయూబ్‌ఖాన్‌పై విజయం సాధించాడు. సెమీఫైనల్లో అతను 5-3, 4-1తో చింతా ప్రణవ్‌పై, అయూబ్ ఖాన్ 4-2, 4-2తో లంక సుహిత్‌రెడ్డి పై గెలిచారు.
 
 బాలికల సింగిల్స్ టైటిల్ పోరులో అనన్య మోహన్ 6-1, 6-3తో దామెర సంస్కృతిపై గెలిచింది. సెమీఫైనల్లో ఆమె 4-0, 4-0తో లిపిక మురమాలపై, సంస్కృతి 4-2, 3-5, 4-1తో సాహితిరెడ్డిపై గెలుపొందారు. అంతకుముందు జరిగిన బాలుర క్వార్టర్ ఫైనల్లో అకాశ్ 7-3తో రుచిత్  గౌడ్‌పై, అయూబ్ ఖాన్ 7-2తో పి.కౌశల్‌పై, సుహిత్‌రెడ్డి 7-4తో వల్లభనేని ప్రీతమ్‌పై, ప్రణవ్ 7-4తో లోకాదిత్య వర్ధన్‌పై నెగ్గారు. బాలికల క్వార్టర్స్‌లో సంస్కృతి 8-4తో లాస్య పట్నాయక్‌పై,  అనన్య మోహన్ 8-2తో కె.అవంతికరెడ్డిపై, లిపిక 8-4తో పి.అమూల్యపై నెగ్గారు.
 

మరిన్ని వార్తలు