రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకున్న రాయుడు 

30 Aug, 2019 06:45 IST|Sakshi

హెచ్‌సీఏ లీగ్స్‌లో బరిలోకి  

సాక్షి, హైదరాబాద్‌: తెలుగుతేజం, భారత క్రికెటర్‌ అంబటి తిరుపతి రాయుడు మళ్లీ బరిలోకి దిగబోతున్నాడు. తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న రాయుడు ఈ సీజన్‌లో హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) నిర్వహించే పరిమిత ఓవర్ల క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడనున్నాడు. హెచ్‌సీఏ వన్డే, టి20 క్రికెట్‌ మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటానని అతను చెప్పాడు. గత రెండేళ్లుగా భారత వన్డే ప్రపంచకప్‌ జట్టు ప్రణాళికల్లో ఉండి కూడా ప్రపంచకప్‌ ఆడలేకపోవడంతో రాయుడు ఆకస్మికంగా రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. తాజాగా ఇప్పుడు అతను మనసు మార్చుకొని బ్యాట్‌ పట్టేందుకు సిద్ధమయ్యాడు.   

మరిన్ని వార్తలు