ప్రిక్వార్టర్స్‌లో అమిత్, గౌరవ్‌

27 Aug, 2017 01:48 IST|Sakshi
ప్రిక్వార్టర్స్‌లో అమిత్, గౌరవ్‌

హంబర్గ్‌ (జర్మనీ): భారత బాక్సర్లు అమిత్‌ ఫంగల్, గౌరవ్‌ బిధురి సత్తా చాటారు. ప్రపంచ పురుషుల సీనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో వీరిద్దరూ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. పురుషుల 49 కేజీల కేటగిరీ తొలి రౌండ్లో అమిత్‌ 4–1తో ఫెడెరికొ సెర్రా (ఇటలీ)పై గెలుపొందాడు. 56 కేజీల విభాగంలో గౌరవ్‌ 5–0తో ప్రపంచ యూత్‌ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత సామ్‌ గుడ్‌మాన్‌ (ఆస్ట్రేలియా)ను కంగుతినిపించాడు. ప్రిక్వార్టర్స్‌లో అమిత్‌... ఏడో సీడ్‌ కార్లస్‌ క్విపో (ఈక్వెడార్‌)తో, గౌరవ్‌... ఆఫ్రికా చాంపియన్‌ జీన్‌ జోర్డి వాడముటూ (మారిషస్‌)తో తలపడతారు. ఈ చాంపియన్‌షిప్‌లో 250 మంది అంతర్జాతీయ బాక్సర్లు తలపడుతుండగా... భారత్‌ తరఫున ఎనిమిది మంది పోటీపడుతున్నారు.

మరిన్ని వార్తలు