కార్ల్‌సన్‌తో ఆనంద్‌ గేమ్‌ ‘డ్రా’  

24 Jan, 2018 01:54 IST|Sakshi

ప్రతిష్టాత్మక టాటా స్టీల్‌ మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ ఆరో ‘డ్రా’ నమోదు చేశాడు. ప్రపంచ చాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ (నార్వే)తో నెదర్లాండ్స్‌లో మంగళవారం జరిగిన తొమ్మిదో రౌండ్‌ గేమ్‌ను ఆనంద్‌ 32 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. 14 మంది గ్రాండ్‌మాస్టర్లు తలపడుతున్న ఈ టోర్నీలో తొమ్మిదో రౌండ్‌ తర్వాత ఆనంద్‌ ఐదు పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నాడు.   

మరిన్ని వార్తలు