లక్నో: ఆంధ్ర, హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్ రసకందాయంలో పడింది. ఆంధ్ర జట్టు హైదరాబాద్కు 219 పరుగుల ఊరించే లక్ష్యాన్ని నిర్దేశించింది. హైదరాబాద్ రెండో ఇన్నింగ్సలో ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 13 పరుగులు చేసింది. ఆట మూడో రోజు ఓవర్నైట్ స్కోరు 81/5తో తొలి ఇన్నింగ్స కొనసాగించిన హైదరాబాద్ 143 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్ర బౌలర్లలో విజయ్ కుమార్ (4/40), శివ కుమార్ (2/43), భార్గవ్ భట్ (2/24) రాణించారు. 47 పరుగుల తొలి ఇన్నింగ్స ఆధిక్యం సంపాదించిన ఆంధ్ర జట్టు రెండో ఇన్నింగ్సలో ధాటిగా ఆడి 29.3 ఓవర్లలో ఆరు వికెట్లకు 171 పరుగులు చేసి ఇన్నింగ్సను డిక్లేర్ చేసింది. కెప్టెన్ విహారి (57) అర్ధ సెంచరీ చేశాడు.