క్వాలిఫయర్‌ చేతిలో ఆండీ ముర్రేకు చుక్కెదురు

13 Mar, 2017 01:11 IST|Sakshi
క్వాలిఫయర్‌ చేతిలో ఆండీ ముర్రేకు చుక్కెదురు

కాలిఫోర్నియా: ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ సిరీస్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ ఆండీ ముర్రేకు ఊహించని పరాజయం ఎదురైంది. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో టాప్‌ సీడ్‌ ముర్రే (బ్రిటన్‌) 4–6, 6–7 (5/7)తో క్వాలిఫయర్‌ వాసెక్‌ పోస్పిసిల్‌ (కెనడా) చేతిలో ఓడిపోయాడు. గతంలో పోస్పిసిల్‌తో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ముర్రే ఈసారి మాత్రం కీలకదశలో తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు.

మరిన్ని వార్తలు