మరో బ్యాడ్మింటన్‌ అకాడమీ ప్రారంభం

21 Aug, 2017 10:55 IST|Sakshi

దుండిగల్‌: హైదరాబాద్ నగరంలో వేగంగా అభివృద్ధి చెందుతోన్న బ్యాడ్మింటన్‌ క్రీడలో రాణించాలనుకునే వారి కోసం మరో అకాడమీ అందుబాటులోకి వచ్చింది. దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ  కళాశాలలో బ్యాడ్మింటన్‌ అకాడమీని నెలకొల్పారు.

 

ఇందులో భాగంగా ప్రముఖ బ్యాడ్మింటన్‌ కోచ్‌ భాస్కర్‌బాబుతో కళాశాల యాజమాన్యం అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్‌ లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతూ కోచ్‌గా భాస్కర్‌బాబు జాతీయ, రాష్ట్ర స్థాయిలో క్రీడాకారులను తీర్చిదిద్దారన్నారు.


 

మరిన్ని వార్తలు