మియామి: వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టీమిండియా ముందుగా ఫ్లోరిడాలో రెండు టీ20లు ఆడనుంది. ఇరు జట్ల మధ్య తొలి టీ20 శనివారం జరుగనుండగా, రెండో టీ20 ఆదివారం జరుగనుంది. దీనిలో భాగంగా ఇప్పటికే ఫ్లోరిడా చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్లో నిమగ్నమైంది. కాగా, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మాత్రం భార్య అనుష్క శర్మతో కలిసి మియామి వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. స్నేహితులతో కలిసి కోహ్లి-అనుష్కల సరదా సరదాగా గడిపారు. అంతా లంచ్ను ఆరగిస్తూ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను అనుష్క శర్మ తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేశారు.
@AnushkaSharma & @imVkohli with friends in Florida 💕📸 #Virushka pic.twitter.com/pz0Ys1M4X9
— Anushka Sharma News (@AnushkaNews) July 31, 2019