కోహ్లి-అనుష్కల జోడి సరదా సరదాగా..

1 Aug, 2019 12:56 IST|Sakshi

మియామి: వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా టీమిండియా ముందుగా ఫ్లోరిడాలో రెండు టీ20లు ఆడనుంది. ఇరు జట్ల మధ్య తొలి టీ20 శనివారం జరుగనుండగా, రెండో టీ20 ఆదివారం​ జరుగనుంది. దీనిలో భాగంగా ఇప్పటికే ఫ్లోరిడా చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్‌లో నిమగ్నమైంది. కాగా, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మాత్రం భార్య అనుష్క శర్మతో  కలిసి మియామి వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. స్నేహితులతో కలిసి కోహ్లి-అనుష్కల సరదా సరదాగా గడిపారు. అంతా లంచ్‌ను ఆరగిస్తూ ఎంజాయ్‌ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను అనుష్క శర్మ తన ట్విటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు.

>
మరిన్ని వార్తలు