చాంపియన్‌ ఆర్మీ గ్రీన్‌ జట్టు

27 Jul, 2019 09:53 IST|Sakshi

ఇంటర్‌ సర్వీసెస్‌ వాలీబాల్‌ చాంపియన్‌షిప్‌

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ సర్వీసెస్‌ వాలీబాల్‌ చాంపియన్‌షిప్‌లో ఆర్మీ గ్రీన్‌ జట్టు విజేతగా నిలిచింది. సికింద్రాబాద్‌ ఈఎంఈ సెంటర్‌లోని ఈగల్‌ ఇండోర్‌ వాలీబాల్‌ స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన ఫైనల్లో ఆర్మీ గ్రీన్‌ జట్టు 25–21, 26–24, 25–20తో ఇండియన్‌ నేవీపై గెలుపొంది టైటిల్‌ను హస్తగతం చేసుకుంది. మూడు రోజుల పాటు జరిగిన ఈ టోర్నమెంట్‌లో ఆర్మీ రెడ్, ఆర్మీ గ్రీన్, ఇండియన్‌ నేవీ, ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ టీమ్‌ జట్లు పాల్గొన్నాయి. పోటీల అనంతరం ఈఎంఈ సెంటర్‌ కమాండెంట్‌ కల్నల్‌ దేవదాస్‌ నందా విజేతలకు టైటిల్‌ను అందజేశారు.

మరిన్ని వార్తలు