అర్పిందర్‌కు కాంస్యం

10 Sep, 2018 05:23 IST|Sakshi
అర్పిందర్‌ సింగ్‌

ఒస్ట్రావా (చెక్‌ రిపబ్లిక్‌): అంతర్జాతీయ అథ్లెటిక్స్‌ సమాఖ్యల సంఘం (ఐఏఏఎఫ్‌) కాంటినెంటల్‌ కప్‌లో పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా అర్పిందర్‌ సింగ్‌ చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన పురుషుల ట్రిపుల్‌ జంప్‌లో అర్పిందర్‌ 16.59 మీటర్ల దూరం దూకి కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రా ఈటెను 80.24 మీటర్లు విసిరి ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

>
మరిన్ని వార్తలు