భారత బాస్కెట్‌బాల్‌ జట్టులో ఆర్య అచ్యుత

27 Oct, 2018 10:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ బాస్కెట్‌బాల్‌ క్రీడాకారిణి ఆర్య అచ్యుత శ్రీరామనేని అద్భుత అవకాశాన్ని అందిపుచ్చుకుంది. ‘ఫిబా’ అండర్‌–18 మహిళల ఆసియా చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికైంది. భారత బాస్కెట్‌బాల్‌ సమాఖ్య ఆధ్వర్యంలో బెంగళూరులో ఈనెల 28 నుంచి నవంబర్‌ 3 వరకు ఆసియా మహిళల టోర్నీ జరుగనుంది. తెలంగాణ తరఫున జాతీయ మహిళల బాస్కెట్‌బాల్‌ జట్టులో చోటు దక్కించుకున్న తొలి క్రీడాకారిణి ఆర్య కావడం విశేషం.

మరిన్ని వార్తలు