జ్వాల జోడికి వాకోవర్

26 Aug, 2014 01:13 IST|Sakshi
జ్వాల జోడికి వాకోవర్

బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్
కోపెన్‌హాగెన్: బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత మహిళల డబుల్స్ జోడి గుత్తా జ్వాల- అశ్విని పొన్నప్ప రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. ఈ జంటతో తలపడాల్సిన హీతర్ ఆల్వర్-కేట్ రాబర్ట్‌షా (ఇంగ్లండ్) ఆఖరి నిమిషంలో టోర్నీ నుంచి తప్పుకోవడంతో భారత ద్వయానికి వాకోవర్ లభించింది. రెండో రౌండ్‌లో జ్వాల-అశ్విని, చైనాకు చెందిన ఐదో సీడ్ కింగ్ టియాన్-యున్‌లీ జావోను ఎదుర్కొంటారు.

గతంలో వీరితో తలపడిన ఆరు సార్లూ భారత జంట ఓటమిపాలైంది.  మరో వైపు మిక్స్‌డ్ డబుల్స్‌లో మాత్రం భారత్‌కు చెందిన అశ్విని పొన్నప్ప-తరుణ్ కోన జోడి తొలి రౌండ్‌లోనే ఓటమిపాలైంది. ప్రపంచ 16వ ర్యాంక్ జంట అండర్స్ క్రిస్టియన్‌సెన్-జూలీ హౌమన్ (డెన్మార్క్) 21-16, 27-25తో అశ్విన్-తరుణ్‌పై విజయం సాధించింది.

మరిన్ని వార్తలు