మళ్లీ ఓడిన జింబాబ్వే

7 Jul, 2018 02:10 IST|Sakshi

హరారే: సొంతగడ్డపై ముక్కోణపు టి20 టోర్నీలో జింబాబ్వేకు ఒక్క విజయం కూడా దక్కలేదు. శుక్రవారం ఇక్కడ జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో జింబాబ్వేను ఓడించింది. ముందుగా జింబాబ్వే 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. మిరే (52 బంతుల్లో 63; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించగా, ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఆండ్రూ టై (3/28) జింబాబ్వేను దెబ్బ తీశాడు.

ఆసీస్‌ 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 154 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్‌ (38 బంతుల్లో 56; 1 ఫోర్, 5 సిక్సర్లు), హెడ్‌ (42 బంతుల్లో 48; 3 ఫోర్లు) మూడో వికెట్‌కు 71 బంతుల్లోనే 103 పరుగులు జోడించారు. ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌ మధ్య ఆదివారం ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది.    

మరిన్ని వార్తలు