యాషెస్‌ సిరీస్‌; ఆసీస్‌ బ్యాటింగ్‌

1 Aug, 2019 15:39 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌: యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఆరంభమైన తొలి టెస్టులో ఆసీస్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పైనీ ​ముందుగా బ్యాటింగ్‌ చేసేందుకు మొగ్గుచూపాడు. ఆసీస్‌ జట్టులో పీటర్‌ సిడెల్‌కు చోటు దక్కింది. హజల్‌వుడ్‌ అవకాశం దక్కుతుందని తొలుత వార్తలు వచ్చినా చివరి సిడెల్‌కు చోటు కల్పిస్తూ క్రికెట్‌ ఆస్ట్రేలియా మేనేజ్‌మెంట్‌ నిర్ణయం తీసుకుంది. మరొకవైపు నిషేధం తర్వాత డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌, బెన్‌క్రాఫ్ట్‌లు తొలి టెస్టు ఆడుతున్నారు. ఈ ముగ్గురికి ఆసీస్‌ తుది జట్టులో చోటు దక్కింది.

ఇక ఇంగ్లండ్‌ జట్టులో జేసన్‌ రాయ్‌ చోటు దక్కించుకున్నాడు. ఇప్పటివరకూ ఒకే ఒక్క టెస్టు మ్యాచ్‌ ఆడిన జేసన్‌ రాయ్‌కు యాషెస్‌ సిరీస్‌లో ఇదే మొదటి టెస్టు మ్యాచ్‌. అదే సమయంలో యాషెస్‌ సిరీస్‌లో జో రూట్‌ తొలిసారి ఇంగ్లండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. 2017–18 సీజన్‌లో ఆసీస్‌ గడ్డపై జరిగిన యాషెస్‌ను ఆస్ట్రేలియా 4–0తో సొం తం చేసుకుంది. అంతకుముందు (2015లో) స్వదేశంలో జరిగిన సిరీస్‌ను 3–2తో గెలుచుకున్న ఇంగ్లండ్‌ మళ్లీ దానిని సాధించాలని పట్టుదలగా ఉంది. బలాబలాలపరంగా ఇంగ్లండ్‌ పటిష్టంగా కనిపిస్తుండగా... ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆసీస్‌ గట్టి పోటీనివ్వాలని భావిస్తోంది. 2001 తర్వాత ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో ఆస్ట్రేలియాతో ఏ ఫార్మాట్‌లో కూడా ఇంగ్లండ్‌ ఓడలేదు. 

మరిన్ని వార్తలు