రెండో రౌండ్‌లో ప్రజ్నేశ్‌

15 Jan, 2020 03:41 IST|Sakshi

మెల్‌బోర్న్‌: ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ శుభారంభం చేయగా... రామ్‌కుమార్‌ తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు. మహిళల సింగిల్స్‌లో అంకిత రైనా కూడా తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో ప్రజ్నేశ్‌ 6–2, 6–4తో హ్యారీ బుర్చియెర్‌ (ఆ్రస్టేలియా)పై గెలుపొందగా... రామ్‌కుమార్‌ 6–4, 4–6, 1–6తో ఫెడెరికో కొరియా (అర్జెంటీనా) చేతిలో ఓడిపోయాడు. అంకిత రైనా 2–6, 6–7 (2/7)తో విక్టోరియా తొమోవా (బల్గేరియా) చేతిలో పరాజయం పాలైంది.

>
మరిన్ని వార్తలు