ప్రిక్వార్టర్స్‌లో సాయిప్రణీత్‌

10 May, 2018 04:31 IST|Sakshi
సాయి ప్రణీత్

సిడ్నీ: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో సాయి ప్రణీత్, సమీర్‌ వర్మ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరారు. తొలి రౌండ్‌లో ప్రణీత్‌ 21–17, 21–14తో మిష జిల్‌బెర్మన్‌ (ఇజ్రాయిల్‌)పై; సమీర్‌ 13–21, 21–17, 21–12తో అభినవ్‌ (న్యూజిలాండ్‌)పై నెగ్గారు. ఇతర మ్యాచ్‌ల్లో సౌరభ్‌ వర్మ 21–19, 17–21, 12–21తో టకుమా ఉయెదా (జపాన్‌) చేతిలో... జయరామ్‌ 20–22, 22–20, 21–17తో టకెశిటా (జపాన్‌) చేతిలో... లక్ష్యసేన్‌ 20–22, 21–13, 19–21తో లీ చెక్‌ యూ (హాంకాంగ్‌) చేతిలో... రాహుల్‌ యాదవ్‌ 11–21, 17–21తో మౌలానా (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలయ్యారు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో తెలుగు అమ్మాయి జక్కా వైష్ణవి రెడ్డి 19–21, 21–15, 21–15తో జార్జినా బ్లాండ్‌ (ఇంగ్లండ్‌)పై గెలిచింది. సాయి ఉత్తేజిత 8–21, 19–21తో మినె (జపాన్‌) చేతిలో... శ్రీకృష్ణప్రియ 18–21, 20–22తో యూలియా (ఇండోనేసియా) చేతిలో ఓటమి చవిచూశారు.

>
మరిన్ని వార్తలు