బెంగళూరు బుల్స్ బోణీ ప్రొ కబడ్డీ లీగ్

27 Jun, 2016 00:45 IST|Sakshi
బెంగళూరు బుల్స్ బోణీ ప్రొ కబడ్డీ లీగ్

ముంబై: ఉత్కంఠభరితంగా సాగిన హోరాహోరీ పోరులో బెంగళూరు బుల్స్ గట్టెక్కింది. చివరి ఐదు నిమిషాల్లో రోహిత్ కుమార్ సూపర్ షో చూపడంతో ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా ఆదివారం బెంగాల్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 24-23 తేడాతో నెగ్గింది. వాస్తవానికి 35వ నిమిషం వరకు బెంగాల్ జట్టు 21-15తో ఆధిక్యంలోనే ఉంది.

ఈ దశలో పుంజుకున్న బుల్స్ ఒక్కో పాయింట్ సాధిస్తూ పోటీలోకొచ్చింది. రోహిత్ ఏడు రైడింగ్ పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్ లో పుణెరి పల్టన్ 41-19 తేడాతో యు ముంబాను చిత్తుగా ఓడించింది. సోమవారం జరిగే మ్యాచ్‌ల్లో బెంగాల్ వారియర్స్‌తో దబంగ్ ఢిల్లీ; పుణెరి పల్టన్‌తో పట్నా పైరేట్స్ తలపడతాయి.

మరిన్ని వార్తలు