అక్టోబరు 23న బీసీసీఐ ఎన్నికలు

25 Sep, 2019 04:13 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎన్నికలు ఒక రోజు ఆలస్యంగా జరగనున్నాయి. ముందుగా నిర్ణయించిన అక్టోబర్‌ 22న కాకుండా ఒక రోజు ఆలస్యంగా 23న జరుగుతాయి. హరియాణా, మహారాష్ట్రలలో శాసనసభ ఎన్నికలు అక్టోబర్‌ 21న జరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ క్రికెట్‌ పరిపాలకుల కమిటీ (సీఓఏ) చైర్మన్‌ వినోద్‌ రాయ్‌ తెలిపారు. అదే విధంగా రాష్ట్ర క్రికెట్‌ సంఘాల ఎన్నికల గడువును కూడా బీసీసీఐ పొడిగించింది. అక్టోబర్‌ 4లోపు ఎన్నికలను పూర్తి చేయాలని ఆదేశించింది.      

మరిన్ని వార్తలు