టైటిల్ స్పాన్సర్షిప్ కోసం బిడ్లను ఆహ్వానించిన బీసీసీఐ

5 Aug, 2014 16:16 IST|Sakshi
టైటిల్ స్పాన్సర్షిప్ కోసం బిడ్లను ఆహ్వానించిన బీసీసీఐ

ముంబై: అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్ మ్యాచ్లకు టైటిల్ స్పాన్సర్షిప్ కోసం భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) బిడ్లను ఆహ్వానించింది. 2014 సెప్టెంబర్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ మధ్య కాలానికి బిడ్లను కోరుతున్నట్టు బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ చెప్పారు.

ఈ మధ్య కాలంలో భారత్ మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఓ టి-20 మ్యాచ్ ఆడనుంది. ఇక ఇరానీ కప్, రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, విజయ్ హజారే, దేవ్దర్ ట్రోఫీ వంటి దేశవాళీ క్రికెట్ టోర్నీలకు కూడా స్పాన్షర్ షిప్ హక్కులు వర్తిస్తాయి. ఈ నెల 6 నుంచి 28 వరకు బిడ్లను స్వీకరిస్తారు. ఆ తర్వాత వీటిని తెరుస్తారు. అధిక ధరకు కోట్ చేసిన వారికి హక్కులు దక్కుతాయి. గత సీజన్లో స్టార్ ఇండియా హక్కులు కైవసం చేసుకుంది.

మరిన్ని వార్తలు