శ్రీశాంత్‌ నిషేధంపై హైకోర్టులో బీసీసీఐ పిటిషన్‌

19 Sep, 2017 00:26 IST|Sakshi

కొచ్చి: పేసర్‌ శ్రీశాంత్‌పై విధించిన నిషేధం ఎత్తివేతను సవాల్‌ చేస్తూ కేరళ హైకోర్టులో బీసీసీఐ పిటిషన్‌ దాఖలు చేసింది. అతడికి వ్యతిరేకంగా ఉన్న ఆధారాల కారణంగానే తాము నిషేధం విధించినట్టు బోర్డు పేర్కొంది.

2013 ఐపీఎల్‌ సీజన్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని ఆరోపిస్తూ శ్రీశాంత్‌పై బోర్డు జీవితకాల నిషేధం విధించింది. అయితే కేరళ హైకోర్టుకు చెందిన సింగిల్‌ బెంచ్‌ గత నెల 7న ఈ నిషేధాన్ని కొట్టివేస్తూ తీర్పునిచ్చింది
 

మరిన్ని వార్తలు