భారత్‌ను ఢీకొట్టే ఇంగ్లండ్‌ జట్టు ఇదే!

29 Jun, 2018 18:53 IST|Sakshi
ఇంగ్లండ్‌ ఆటగాళ్లు (ఫైల్‌ ఫొటో)

లండన్: ఆస్ట్రేలియాను 5-0తో చిత్తుచేసిన ఇంగ్లండ్‌ అదే ఉత్సాహంతో భారత్‌ను ఢీకొట్టెందుకు సిద్దమైంది. జూలై 12 నుంచి సొంతగడ్డపై జరిగే వన్డే సిరీస్‌లో టీమిండియాతో తలపడే ఇంగ్లండ్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ఈసీబీ శుక్రవారం ప్రకటించింది. తొడ కండరాల గాయం కారణంగా ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్‌కు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ జట్టులోకి పునరాగమనం చేశాడు. దీంతో ఇంగ్లీష్ జట్టుకు మరింత బలం చేకూరనుంది. ఒకవేళ స్టోక్స్ తన ఫిట్‌నెస్ నిరూపించుకుంటే భారత్‌తో జులై 8న బ్రిస్టోల్‌లో జరగనున్న మూడో టీ20కే ఇంగ్లండ్‌ తుది జట్టులోకి వస్తాడాని ఈసీబీ పేర్కొంది. గాయం నుంచి కోలుకుంటున్న క్రిస్‌వోక్స్ సైతం ఫిట్‌నెస్ సాధించినైట్లెతే చివరి వన్డేలోపు జట్టులో చేరే అవకాశం ఉందని కూడా బోర్డు వెల్లడించింది.

ఇంగ్లండ్ తుది జట్టు:
ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), మొయిన్ అలీ, జానీ బెయిర్‌స్టో, జేక్ బాల్, జోస్ బట్లర్, టామ్ కర్రన్, అలెక్స్ హేల్స్, లియామ్ ఫ్లంకెట్, అడిల్ రషీద్, జో రూట్, జేసన్ రాయ్, బెన్ స్టోక్స్, డేవిడ్ విల్లే, మార్క్ వుడ్

మరిన్ని వార్తలు