బెంగాల్‌ వారియర్స్‌ గెలుపు

18 Nov, 2018 02:22 IST|Sakshi

అహ్మదాబాద్‌: ప్రొ కబడ్డీ లీగ్‌లో బెంగాల్‌ వారియర్స్‌ ఐదో విజయం నమోదు చేసుకుంది. శనివారం ఇక్కడ జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో బెంగాల్‌ వారియర్స్‌ 26–22తో పుణేరీ పల్టన్స్‌పై గెలిచింది. గత రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన బెంగాల్‌ ఈ మ్యాచ్‌లో చెలరేగింది. ఇరు జట్లు హోరాహోరీగా పోరాడటంతో ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. మరో నాలుగు నిమిషాల్లో మ్యాచ్‌ ముగుస్తుందనగా 18–19తో వెనుకబడి ఉన్న బెంగాల్‌... రైడర్‌ మణీందర్‌ (6 పాయింట్లు) చెలరేగడంతో అనూహ్యంగా పుంజుకొని గెలుపొందింది. పల్టన్స్‌ తరఫున జీబీ మోరె 9 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. బెంగళూరు బుల్స్, గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ మధ్య జరిగిన మరో మ్యాచ్‌ 30–30తో టైగా ముగిసింది. నేటి మ్యాచ్‌ల్లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌తో బెంగళూరు బుల్స్, గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌తో యూపీ యోధా తలపడతాయి.   

మరిన్ని వార్తలు