బెంగళూరుకు చావోరేవో...

27 Apr, 2017 19:56 IST|Sakshi
బెంగళూరుకు చావోరేవో...

బెంగళూరు:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ లయన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.  టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ సురేశ్ రైనా తొలుత ఫీల్డింగ్ చేసేందుకు మొగ్గు చూపాడు. ఈ సీజన్ లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి లీగ్ మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించింది.

ఇదిలా ఉంచితే, టోర్నీలో ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు ఇప్పటివరకు కేవలం రెండు విజయాలను మాత్రమే సాధించింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ముగియగా.. మిగిలిన ఐదు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ఈ క్రమంలో ఐదు పాయింట్లతో పట్టికలో ఆరోస్థానంలో కొనసాగుతోంది. బెంగళూరు చేతిలో ఇంకా ఆరు మ్యాచ్‌లు మాత్రమే ఉండడంతో ఇప్పటి నుంచి ప్రతీమ్యాచ్‌లోనూ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగాలి.

మరొకవైపు  గుజరాత్‌ ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. టోర్నీలో ఏడు మ్యాచ్‌లు ఆడిన గుజరాత్‌.. కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది. మరో ఐదు మ్యాచ్‌ల్లో ఓడిన లయన్స్‌ కేవలం నాలుగు పాయింట్లతో పట్టికలో అట్టడుగున నిలిచింది. జట్టులో కెప్టెన్‌ సురేశ్‌ రైనా, బ్రెండన్‌ మెకల్లమ్‌ , దినేశ్‌ కార్తిక్‌ రాణిస్తున్నారు. అయితే వీరికి ఇతర బ్యాట్స్‌మెన్‌ నుంచి సహకారం అందడం లేదు.ఈ మ్యాచ్ లో విజయం ఇరు జట్లకు కీలకం కావడంతో రసవత్తర పోరు జరిగే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు