మెయిన్‌ ‘డ్రా’కు చేరువలో భువన

29 Jan, 2019 10:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల క్వాలిఫయింగ్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ క్రీడాకారులు భువన కాల్వ, సామ సాత్విక, సాయి సంహిత చామర్తి ముందంజ వేశారు. జోధ్‌పూర్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో వీరు మెయిన్‌ డ్రా పోటీలకు మరో విజయం దూరంలో నిలిచారు. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వాలిఫయింగ్‌ తొలి రౌండ్‌లో పదో సీడ్‌ భువన 7–6 (7/3), 6–4తో నటాషాపై గెలుపొందగా... పన్నెండో సీడ్‌ సామ సాత్విక 6–0, 6–0తో వైదేహిని చిత్తుగా ఓడించింది. మరో మ్యాచ్‌లో ఆరో సీడ్‌ సాయి సంహిత 6–2, 6–2తో ఫర్హత్‌ అలీన్‌ ఖమర్‌పై గెలుపొంది రెండో రౌండ్‌కు చేరుకుంది. 

మరిన్ని వార్తలు