క్వార్టర్స్‌లో బోపన్న జోడి

9 Jun, 2016 00:30 IST|Sakshi

ఎస్ హెర్టోజెన్‌బాష్ (నెదర్లాండ్స్): రికో ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రోహన్ బోపన్న జోడీ క్వార్టర్‌ఫైనల్స్‌లో ప్రవేశించింది. ప్రిక్వార్టర్స్‌లో బోపన్న, నికోలస్ మహత్ (ఫ్రాన్స్) జోడీ 6-1, 6-4తో రాబిన్ హస్సే, గిలెర్మో గార్సియా లోపెజ్ జంటపై విజయం సాధించింది. క్వార్టర్ ఫైనల్స్‌లో బోపన్న జోడీ గిల్స్ ముల్లర్, ఫ్రెడెరిక్ నీల్సన్ జంటతో తలపడుతుంది.

>
మరిన్ని వార్తలు