క్వార్టర్స్‌లో బోపన్న జంట 

13 Feb, 2020 08:21 IST|Sakshi

న్యూఢిల్లీ : రోటర్‌డామ్‌ ఓపెన్‌ ఏటీపీ–500 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో రోహన్‌ బోపన్న (భారత్‌)–డెనిస్‌ షపోవలోవ్‌ (కెనడా) జంట శుభారంభం చేసింది. నెదర్లాండ్స్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో బోపన్న–షపోవలోవ్‌ ద్వయం 7–6 (7/0), 6–7 (5/7), 10–8తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో జాన్‌ పీర్స్‌ (ఆస్ట్రేలియా)–మైకేల్‌ వీనస్‌ (న్యూజిలాండ్‌) జంటను ఓడించి క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. గంటా 42 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జోడీ 12 ఏస్‌లు సంధించి, రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. నేడు జరిగే క్వార్టర్‌ ఫైనల్లో నాలుగో సీడ్‌ జీన్‌ జూలియన్‌ రోజర్‌ (నెదర్లాండ్స్‌)–హొరియా టెకావ్‌ (రొమేనియా) ద్వయంతో బోపన్న జంట ఆడుతుంది.    

>
మరిన్ని వార్తలు