మెల్‌బోర్న్ టెస్టు: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

26 Dec, 2014 05:05 IST|Sakshi

మెల్‌బోర్న్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారమిక్కడ జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత ఆసీస్ ఓపెనర్ ఆటగాళ్లు రోజర్స్, వార్నర్లు శుభారంభం చేశారు. ఆసీస్ ఈ టెస్టును డ్రా చేసుకున్నా  బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ వాళ్లకే దక్కుతుంది. ఈ మ్యాచ్లో ధోనిసేన ప్రదర్శన ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న భారత్... తుది జట్టు కూర్పుపై తీవ్రంగా కసరత్తు చేస్తోంది.

ఇప్పటికే వరుస ఓటములతో కుదేలైన భారత్... బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని నిలబెట్టుకోవాలంటే చివరి రెండు టెస్టుల్లో కచ్చితంగా గెలిచి తీరాలి.  నాలుగు టెస్టుల సిరీస్ లో 2-0తో వెనుకబడిన టీమిండియా సిరీస్ చేజారిపోకుండా ఉండాలంటే ఈ మ్యాచ్ లో కచ్చితంగా గెలవాలి. కాగా, అడిలైడ్, బ్రిస్బేన్ టెస్టుల్లో పరాభవానికి బదులు తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది.

మరిన్ని వార్తలు