భారత్‌కు కాంస్య పతకాలు

16 May, 2015 02:26 IST|Sakshi

థాయ్‌లాండ్ ఓపెన్ టీటీ

 బ్యాంకాక్ : థాయ్‌లాండ్ ఓపెన్ క్యాడెట్, జూనియర్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత బాలికల జట్లకు కాంస్య పతకాలు లభించాయి. క్యాడెట్‌తోపాటు జూనియర్ విభాగంలోనూ భారత జట్ల పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో క్యాడెట్ జట్టు 2-3 తేడాతో హాంకాంగ్ చేతిలో... జూనియర్ జట్టు 0-3తో చైనీస్ తైపీ చేతిలో ఓడిపోయి కాంస్య పతకాలతో సంతృప్తి పడ్డాయి. ఈ టోర్నీలో భారత్ తరఫున తెలంగాణ క్రీడాకారిణులు వరుణీ జైస్వాల్, ఆకుల శ్రీజ జూనియర్  విభాగంలోపాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు