న్యూఢిల్లీ: జూనియర్ ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత ఆటగాడు సజన్కు కాంస్య పతకం లభించింది. ఫిన్లాండ్లోని టాంపెరేలో ఈ పోటీలు జరుగుతున్నాయి. గ్రీకో రోమన్ విభాగం (74 కేజీలు) రెపిచేజ్లో సజన్ 6–1 తేడాతో అలీ ఉస్మాన్ (టర్కీ)ని చిత్తు చేశాడు.
మరో భారత ఆటగాడు మనీశ్ (60 కేజీలు)...హసన్ అహ్మద్ (ఈజిప్ట్) చేతిలో 3–4తో ఓడి కాంస్య పతకం కోల్పోయాడు. ఇతర విభాగాల్లో భారత ఆటగాళ్లు విజయ్, దినేశ్, సునీల్ కుమార్, సతీశ్ ఆరంభ రౌండ్లలోనే ఓడి పోటీల నుంచి నిష్క్రమించారు.