టి20 కూడా ఇంగ్లండ్‌దే

29 Jun, 2018 04:14 IST|Sakshi

28 పరుగులతో ఆస్ట్రేలియా చిత్తు

బర్మింగ్‌హామ్‌: ఇంగ్లండ్‌ పర్యటనలో ఆస్ట్రేలియా పరాజయం పరిపూర్ణమైంది. కంగారూలు ఏకైక టి20లో కూడా పరాజయంపాలై వెనుదిరిగారు. బుధవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 28 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 221 పరుగులు సాధించింది.  జోస్‌ బట్లర్‌ (30 బంతుల్లో 61; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) మరోసారి చెలరేగాడు. ఇంగ్లండ్‌ తరఫున ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ (22 బంతుల్లో) చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. జేసన్‌ రాయ్‌ (44; 6 ఫోర్లు), హేల్స్‌ (49; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం ఆసీస్‌ 19.4 ఓవర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. ఆరోన్‌ ఫించ్‌ (41 బంతుల్లో 84; 7 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగినా, మిగతావారంతా విఫలం కావడంతో ఓటమి తప్పలేదు.

మరిన్ని వార్తలు