క్రికెటర్ అమిత్ మిశ్రాపై లైంగిక వేధింపుల కేసు

20 Oct, 2015 20:08 IST|Sakshi
క్రికెటర్ అమిత్ మిశ్రాపై లైంగిక వేధింపుల కేసు

బెంగళూరు: భారత స్పిన్నర్ అమిత్ మిశ్రా ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. మిశ్రా తనను లైంగికంగా వేధించినట్టు ఓ మహిళ ఆరోపించింది. ఈ మేరకు కేసు నమోదు  చేసిన బెంగళూరు పోలీసులు.. విచారణకు హాజరు కావాల్సిందిగా మంగళవారం మిశ్రాకు సమన్లు జారీ చేశారు. వివరాలిలా ఉన్నాయి.

గత సెప్టెంబర్లో బెంగళూరులోని ఓ హోటల్లో బస చేసిన అమిత్ మిశ్రాను చూసేందుకు వెళ్లిన తనను లైంగిక వేధించాడని ఓ మహిళ బెంగళూరు అశోక్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బెంగళూరు సెంట్రల్ డీసీపీ సందీప్ పాటిల్ ఈ విషయాన్ని మీడియాకు చెప్పారు. ఐపీసీ సెక్షన్లు 354, 328 కింద మిశ్రాపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. గత నెలలో శిక్షణ కోసం మిశ్రా బెంగళూరుకు వచ్చినట్టు చెప్పారు. సమన్లకు స్పందించకుంటే మిశ్రాపై కఠిన చర్యలు తీసుకుంటామని సందీప్ పాటిల్ తెలిపారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్లో భారత జట్టుకు అమిత్ మిశ్రా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

మరిన్ని వార్తలు