నవంబర్ 4న సీబీఎల్ షురూ

17 Sep, 2016 10:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: సీడీకే గ్లోబల్ కార్పొరేట్ బ్యాడ్మింటన్ లీగ్ (సీబీఎల్) నవంబర్ 4నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌కు చెందిన సీడీకే గ్లోబల్ కంపెనీ, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ (పీజీబీఏ) సంయుక్తంగా ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నాయి. పీజీబీఏలో మూడు రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో దాదాపు 200 కార్పొరేట్ కంపెనీలకు చెందిన 500 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు.

 

>
మరిన్ని వార్తలు