కేపీఎల్‌ ఫిక్సింగ్‌: అంతర్జాతీయ బుకీ అరెస్ట్‌

10 Nov, 2019 12:26 IST|Sakshi

బెంగళూరు:  కర్ణాటక ప్రీమియర్‌ లీగ్‌(కేపీఎల్‌)లో పలు మ్యాచ్‌లను ఫిక్సింగ్‌ చేసేందుకు యత్నించిన ఒక అంతర్జాతీయ బుకీని అరెస్టు చేశారు. మ్యాచ్‌లను ఫిక్సింగ్‌కు చేయడానికి పాల్పడ్డ హర్యానాకు చెందిన సయ్యమ్‌ అనే వ్యక్తిని సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెలబ్రేటీ డ్రమ్మర్‌ భవేశ్‌ బఫ్నా సాయంతో మ్యాచ్‌లను ఫిక్స్‌ చేయడానికి సయ్యర్‌ యత్నించాడు. అయితే అతనిపై ముందుగా లుక్‌ ఔట్‌ నోటీసులు పోలీసులు జారీ చేశారు.(ఇక్కడ చదవండి: క్రికెటర్‌ గౌతమ్‌ అరెస్ట్‌)

ఈ క‍్రమంలోనే వెస్టిండీస్‌లో దాక్కొన్న అతన్ని అరెస్ట్‌ చేశారు. ఇటీవల బళ్లారి టస్కర్స్‌ కెప్టెన్‌ సీఎం గౌతమ్‌తో పాటు అబ్రార్‌ కాజీలను పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ నెమ్మదిగా బ్యాటింగ్‌ చేయడానికి రూ. 20 లక్షలకు ఒప్పందం చేసుకుని మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేయడానికి సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. దాంతో వీరిని అరెస్ట్‌ చేసిన పోలీసులు.. తాజాగా బుకీని కూడా అదుపులోకి తీసుకుని విచారణను వేగవంతం చేశారు.

మరిన్ని వార్తలు