సెంచరీతో ఆదుకున్న ధనంజయ

7 Nov, 2016 00:35 IST|Sakshi
సెంచరీతో ఆదుకున్న ధనంజయ

హరారే: ధనంజయ డి సిల్వ (197 బంతుల్లో 100 బ్యాటింగ్; 11 ఫోర్లు) అజేయ శతకంతో ఆదుకోవడంతో జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఆదివారం ప్రారంభమైన ఈ రెండో టెస్టులో ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్‌‌సలో లంక 90 ఓవర్లలో ఐదు వికెట్లకు 290 పరుగులు చేసింది. ఓ దశలో 112 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోరుున పర్యాటక జట్టు ఇన్నింగ్‌‌సను డి సిల్వ, ఉపుల్ తరంగ (155 బంతుల్లో 79; 8 ఫోర్లు) నిలబెట్టారు.

స్లో పిచ్‌పై పరుగులు రావడం కష్టంగా మారడంతో ముందుగా వీరు క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రాముఖ్యం ఇచ్చారు. ఆ తర్వాత తమ బ్యాట్లకు పనిచెప్పడంతో పరుగుల వేగం పెరిగింది. ఇదే క్రమంలో డి సిల్వ తన ఐదు టెస్టుల కెరీర్‌లో రెండో సెంచరీ సాధించాడు. మొత్తంగా ఐదో వికెట్‌కు వీరి మధ్య 143 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. ప్రస్తుతం క్రీజులో డి సిల్వతో పాటు గుణరత్నే (13 బ్యాటింగ్) ఉన్నాడు. మసకద్జాకు రెండు వికెట్లు దక్కారుు.

మరిన్ని వార్తలు