కాపాబ్లాంకా స్మారక చెస్‌ టోర్నీ విజేత శశికిరణ్‌

8 Jun, 2017 00:58 IST|Sakshi
కాపాబ్లాంకా స్మారక చెస్‌ టోర్నీ విజేత శశికిరణ్‌

చెన్నై: ప్రపంచ మాజీ చాంపియన్‌ కాపాబ్లాంకా (క్యూబా) స్మారకార్థం నిర్వహించిన అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ కృష్ణన్‌ శశికిరణ్‌ విజేతగా నిలిచాడు. క్యూబాలోని వారాడెరోలో ఆరుగురు గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో ఈ టోర్నీ జరిగింది. పది రౌండ్‌ల తర్వాత శశికిరణ్‌ 6.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.

ఈ టోర్నీ లో శశికిరణ్‌ మూడు గేముల్లో గెలిచి, ఏడింటిని ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. తద్వారా 1962 నుంచి జరుగుతోన్న కాపాబ్లాంకా చెస్‌ టోర్నీలో విజేతగా నిలిచిన తొలి భారతీయ క్రీడాకారుడిగా శశికిరణ్‌ గుర్తింపు పొందాడు.

మరిన్ని వార్తలు