కరాచీ: స్పాట్ ఫిక్సింగ్ కేసులో ముంబై పోలీసుల చార్జిషీట్లో తన పేరును నమోదు చేయడాన్ని వివాదాస్పద పాక్ అంపైర్ అసద్ రవూఫ్ తప్పుపట్టారు.
బుకీలతో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ‘చర్చించడం, సమాచారాన్ని చేరవేయడం రెండు వేర్వేరు అంశాలు. వివిధ వర్గాలతో మనం చర్చించడం పరిపాటి. నా న్యాయ సలహాదారులతో సంప్రదించి పూర్తి వివరాలు వెల్లడిస్తా’ అని రవూఫ్ అన్నారు.