చెన్నై ఓపెన్‌ ఫైనల్లో దివిజ్‌–పురవ్‌ జోడీ

7 Jan, 2017 00:02 IST|Sakshi
చెన్నై ఓపెన్‌ ఫైనల్లో దివిజ్‌–పురవ్‌ జోడీ

చెన్నై: స్వదేశంలో తొలి ఏటీపీ డబుల్స్‌ టైటిల్‌ గెలిచేందుకు దివిజ్‌ శరణ్‌–పురవ్‌ రాజా (భారత్‌) జంట మరింత చేరువైంది. చెన్నై ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీలో ఈ జోడీ టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో దివిజ్‌ శరణ్‌–పురవ్‌ రాజా ద్వయం 6–4, 6–2తో గిలెర్మె దురాన్‌–ఆండ్రీస్‌ మోల్తెని (అర్జెంటీనా) జంటపై విజయం సాధించింది.

గతంలో దివిజ్‌–పురవ్‌ బొగోటా ఓపెన్‌ (2013లో), లాస్‌ కబోస్‌ ఓపెన్‌ (2016లో) టోర్నీలలో విజేతగా నిలిచారు. శనివారం జరిగే రెండో సెమీఫైనల్లో రోహన్‌ బోపన్న–జీవన్‌ (భారత్‌) జంట నికొలస్‌ మోన్‌రో (అమెరికా)–అర్తెమ్‌ సితాక్‌ (న్యూజిలాండ్‌) జోడీతో ఆడుతుంది.  
 

>
మరిన్ని వార్తలు