ఆనంద్‌ గెలుపు 

25 Jan, 2018 00:47 IST|Sakshi

విక్‌ అన్‌ జీ (నెదర్లాండ్స్‌): ప్రతిష్టాత్మక టాటా స్టీల్‌ మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ మూడో విజయాన్ని సాధించాడు. జోన్స్‌ గవాయిన్‌ (ఇంగ్లండ్‌)తో బుధవారం జరిగిన పదో రౌండ్‌ గేమ్‌లో ఆనంద్‌ 40 ఎత్తుల్లో విజయం సాధించాడు. 14 మంది గ్రాండ్‌మాస్టర్లు తలపడుతున్న ఈ టోర్నీలో పదో రౌండ్‌ తర్వాత ఆనంద్‌ 6 పాయింట్లతో నాలుగోస్థానంలో ఉన్నాడు.  

మరిన్ని వార్తలు