దోహా: ఖతార్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్ టైటిల్ను చైనా గ్రాండ్మాస్టర్ యు యాంగ్యి గెలుచుకున్నాడు. వ్లాదిమిర్ క్రామ్నిక్ (రష్యా)తో జరిగిన తొమ్మిదో గేమ్లో 33 ఎత్తుల వద్ద విజయం సాధించిన యాంగ్యి 7.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు.
హైదరాబాద్ గ్రాండ్మాస్టర్లు పెంటేల హరికృష్ణ, ద్రోణవల్లి హారికలు 9వ రౌండ్ గేమ్లను డ్రా చేసుకున్నారు. హరికృష్ణ 5.5 పాయింట్లతో సంయుక్తంగా 24వ స్థానంలో; హారిక 4 పాయింట్లతో సంయుక్తంగా 91వ స్థానంలో నిలిచారు.