రాష్ట్ర స్థాయి చెస్‌ టోర్నీ బ్రోచర్‌ విడుదల

2 Jul, 2019 14:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పడాల లక్ష్మమ్మ, భూమా గౌడ్‌ స్మారక తెలంగాణ రాష్ట్ర ఓపెన్‌ చెస్‌ టోర్నమెంట్‌కు సంబంధించిన బ్రోచర్‌ను సోమవారం విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర చెస్‌ సంఘం (టీఎస్‌సీఏ) కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు కేఏ శివప్రసాద్, కార్యదర్శి కేఎస్‌ ప్రసాద్‌ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఎల్బీ స్టేడియం వేదికగా ఈనెల 13, 14 తేదీల్లో ఈ టోర్నీని నిర్వహిస్తారు. విజేతకు రూ. 30,000 ప్రైజ్‌మనీ అందజేయనున్నారు.  వివరాలకు  www. chesstelangana.com వెబ్‌సైట్‌లో లేదా ప్రశాంత్‌ గౌడ్‌ (88010 00222, 88010 00666)ను సంప్రదించాలి. 

మరిన్ని వార్తలు