12, 13 తేదీల్లో చెస్‌ టోర్నీ

11 Aug, 2017 10:44 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బ్రిలియంట్‌ ట్రోఫీ ఓపెన్‌ చెస్‌ టోర్నమెంట్‌ ఈనెల 12, 13 తేదీల్లో జరగనుంది. దిల్‌సుఖ్‌నగర్‌లోని బ్రిలియంట్‌ గ్రామర్‌ స్కూల్‌ వేదికగా ఈ టోర్నీ జరుగుతుంది. అండర్‌–6, 8, 10, 12, 14 బాలబాలికల విభాగాల్లో వేరువేరుగా పోటీలను నిర్వహిస్తారు.

 

ఈ టోర్నీలో రాణించిన 20మంది క్రీడాకారులకు బహుమతులను అందజేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు 12వ తేదీ మధ్యాహ్నం గం. 1లోగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. మరిన్ని వివరాల కోసం జె. సుబ్రహ్మణ్యం (92473 99717)ను సంప్రదించాలి.

 

 

మరిన్ని వార్తలు